Thursday, September 3, 2015

తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకు తీసుకుంటారు?

 తీర్ధాన్ని మూడుసార్లు ఎందుకుతీసుకుంటారు?

మొదటి సారి తీర్ధము శరీర శుద్ధి, శుచికి
రెండవసారి తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు, 
మూడవసారి తీర్ధము పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు. 
ఓం అచ్యుతాయనమః అని మొదటిసారి భక్తులు తీసుకోన్నచో వారి ఆత్మా పవిత్రము అగును. 
ఓం అనంతాయ నమః అని రెండవసారి, ఓం గోవిందాయనమః అని మూడవసారి తీర్ధము తీసుకొంటే వారికి మోక్షమునకు యోగ్యతా లభించును. శ్రీమన్నారాయణుని అనుగ్రహము వలన స్త్రీ, బాల, వృద్దులు అందరూ శ్రద్ధా భక్తులతో మూడుసార్లు తీర్ధం సేవించవలెను.
తీర్ధమంత్రము:- 
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం!
సమస్త పాప శమనం విష్ణు పాదోదకం శుభం!! 
పై మంత్రముతో తీర్ధం పుచ్చుకొని అందరూ ఆ భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరుకొంటున్నాను
                                                               ../\..

No comments:

Post a Comment

Total Pageviews