Tuesday, October 24, 2017

దశావతారాలు

దశావతారాలు
1.మత్స్యావతారం : మొదట నీరు ఏర్పడింది( నేటి ఆధునిక విజ్ఞానం ప్రకారం కూడా భూమిపైన మొదట అంతా నీరే ఉండేది).కాబట్టి మొదట జలచరాలు ఏర్పడ్డాయి.

2.తాబేలు : ఇది ఉభయచరం అనగా భూమిపైన మరియు నీటిలో రెండింటిలో సంచరించునది.

3.వరాహవతారం : ఇది భూమిపైన మాత్రం సంచరించేది.భూమిపైన జీవరాసుల ఉత్పత్తి గురించి ఇక్కడ కనిపిస్తోంది.

4.నరసింహ : ఇక్కడ మానవుని మొదటిదశ వర్ణింపబడింది.ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణరూపం పొందలేదు.

5.వామన : మానవులు మొదట మరుగుజ్జులుగా ఉండడాన్ని సూచించడం జరిగింది.


6.పరశురామ : ఇచ్చట మనిషి యొక్క పశుప్రవృత్తిని(అంటే చెప్పినది ఆలోచించకుండా చేయడం) సూచిస్తోంది.


7.శ్రీరామ : ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కొరకు జీవించడాన్ని మరియు మనిషి తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం గమనించవచ్చు.


8.శ్రీకృష్ణ : ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని చెప్పడం జరిగింది.

9.బుద్ద : అన్ని సుఖాల మరియు అనుభవాల తర్వాత మనిషి వైరాగ్యభావంతో జీవించడాన్ని సూచించడం జరిగింది.


10.కల్కి : ఈ అవతారం ఇంకా రాలేదు కనుక దీని విషయం తెలియరావడం లేదు.

No comments:

Post a Comment

Total Pageviews