Friday, April 24, 2015

తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామికి పద్మావతీ అమ్మవారు కుడిప్రక్కన, శ్రీ లక్ష్మీదేవి ఎడమ ప్రక్కన ఎందుకు ఉంటారు?

తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామికి పద్మావతీ అమ్మవారు కుడిప్రక్కన, 
శ్రీ లక్ష్మీదేవి ఎడమ ప్రక్కన ఎందుకు ఉంటారు?

                                           తిరుమలపై శ్రీమహావిష్ణువు  మనుష్య రూపము దాల్చడము, ఆ తరువాత ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోవడము అందరికీ తెలిసిందే. శ్రీవేంకటేశ్వరస్వామి , పద్మావతి దేవిల వివాహం గురించి సరిగ్గా లక్ష్మీదేవికి నారదుడు చెబుతాడు. దానితో లక్ష్మీదేవి  శ్రీవేంకటేశ్వరస్వామి , పద్మావతి దేవిలతోను  గొడవకు దిగుతుంది. ఆ సమయంలో శ్రీనివాసుడు పద్మావతి  పూర్వగాధ శ్రీలక్ష్మీదేవికి చెప్పి, కుడి వక్షస్థలముపై పద్మావతిని, శ్రీలక్ష్మీదేవిని ఎడమ వక్షస్థలం పైన ఉండమని కోరుతాడు. భర్త ఆదేశానుసారంగా ఇద్దరు అమ్మవార్లు స్వామికి ఇరువైపులా ఉంటారని పెద్దలు చెపుతారు.


No comments:

Post a Comment

Total Pageviews